తెలుగు బుల్లితెర నటి మైథిలి తన ఇంట్లో ఆత్మహత్యాయత్నం చేసింది. 8 బ్రీజర్లు, నిద్ర మాత్రలు మింగిన ఆమెను పోలీసులు సమయానికి ఆసుపత్రికి చేర్చడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. నటి ఆత్మహత్యాయత్నం గురించి తెలుసుకున్న పంజాగుట్ట పోలీసులు ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఆమెను ట్రాక్ చేసి అపస్మారక స్థితిలో ఉన్న మైథిలిని నిమ్స్కు తరలించి అత్యవసర వైద్యాన్ని అందేలా చూశారు. ఆరు నెలల క్రితం ఆమె తన భర్తపై మైథిలి పోలీసులకు ఫిర్యాదు చేసింది.