తెలంగాణలోని దమ్మాయి గూడలో నిన్న మిస్ అయిన 10 ఏళ్ల చిన్నారి ఇందు ఈరోజు శవంగా కనిపించింది. నాలుగో తరగతి చదువుతున్న ఈ చిన్నారి కోసం పోలీసులు సిసి కెమెరాలను వెతకగా అందులో పాప నడుచుకుంటూ వెళ్ళడం కనిపించింది. దీంతో ఈ ఉదయం స్కూలుకు దగ్గరలోని చెరువులో తనిఖీలు చేసిన పోలీసులు అందులో పాప మృతదేహాన్ని గుర్తించి పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. అయితే, డెడ్ బాడీని తమకు చూపించకపోవడంపై పాప తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.