ఢిల్లీలోని షాహీన్బాగ్లోని అక్రమ నిర్మాణాలను కూల్చేందుకు ఆ సిటీ కార్పొరేషన్ అధికారులు బుల్డోజర్లు తీసుకురావడం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. అక్కడ నివసిస్తున్న ప్రజలు బుల్డోజర్లకు అడ్డంగా రోడ్డు మీద భైఠాయించారు. 15 ఏళ్ళుగా తామంతా ఇక్కడే ఉంటున్నామని, ఇప్పుడు ఆక్రమణల రద్దు ఎందుకు చేస్తున్నారని వారంతా అధికారులను నిలదీశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ అక్రమ కట్టడాలను కూల్చి తీరతామని మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ అన్నారు.