నిర్మాతల మండలి : ఆ మాట మేమెక్కడా అనలేదు

By udayam on November 22nd / 10:57 am IST

తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి తీసుకున్న నిర్ణయాన్ని విమర్శిస్తూ పలువురు కోలీవుడ్‌ నిర్మాతలు చేసిన వ్యాఖ్యలపై టిఎఫ్​పీసీ సెక్రటరీ ప్రసన్న కుమార్‌ స్పందించారు. ‘2023 సంక్రాంతి రిలీజ్‌ల విషయంలో తొలి ప్రాధాన్యం తెలుగు చిత్రాలకేనని పేర్కొంటూ తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ఓ ప్రకటన విడుదల చేసింది. మొదటి ప్రాధాన్యత తెలుగు సినిమాలకు ఇవ్వాలని..మిగిలిన థియేటర్స్‌ను డబ్బింగ్‌ చిత్రాలకు కేటాయించాలని అందులోని సారంశం. అంతేకానీ డబ్బింగ్‌ సినిమాలను తెలుగు రాష్ట్రాల్లో బ్యాన్‌ చేస్తామని, ఇక్కడ ఆడనివ్వమని ఆ ప్రకటనలో ఎక్కడా చెప్పలేదు.

ట్యాగ్స్​