థాయ్‌లాండ్: సముద్రంలో మునిగిన యుద్ధ నౌక.. 31 మంది ఇంకా నీటిలోనే

By udayam on December 19th / 9:34 am IST

గల్ఫ్ ఆఫ్ థాయ్‌లాండ్‌లో తుపాను కారణంగా థాయ్ నేవీ షిప్ బోల్తా పడింది. ఈ ఘటనలో 75 మంది నేవీ సిబ్బంది బయటపడగా.. 31 మంది షిప్​ లోనే ఉండి సముద్రంలో చిక్కుకుపోయారు.ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, కానీ సిబ్బందిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని థాయిలాండ్​ నేవీ ప్రకటించింది. షిప్‌లోకి నీరు చేరడంతో బోల్తా పడిందని, నౌక అంతా జలమయం అయిపోయిందని, పవర్ రూమ్ షార్ట్ సర్క్యూట్ అయిందని అధికారులు తెలిపారు. విద్యుత్ లేకపోవడంతో, నౌకను కంట్రోల్‌లోకి తీసుకురావడం సిబ్బందికి కష్టమైంది. నౌక ఓ పక్కకు ఒరిగి క్రమంగా నీట మునిగింది.

ట్యాగ్స్​