దేశాన్ని, ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఘటనలు 2022 ఏడాదిలో చోటు చేసుకున్నాయి. వీటిల్లో ఢిల్లీకి చెందిన శ్రద్ధా వాకర్ దారుణ హత్య అన్నింటికంటే ఎక్కువగా దేశాన్ని వణికించింది. అతడి ప్రియుడు ఆమెను 35 ముక్కలుగా నరికి ఢిల్లీ శివార్లలో పారేశాడు. ఆ తర్వాత రష్యా మారణ హోమంలో ఉక్రెయిన్ లో బయటపడ్డ భారీ శవాల గుట్టల ఫొటోలు ప్రపంచాన్ని వణికించాయి. కేరళలో అక్టోబర్ మొదట్లో బయటపడ్డ నరబలి కేసు కూడా దేశాన్ని ఉలక్కిపడేలా చేసింది. జపాన్ ప్రధాని షింబో అబేను ఓ వ్యక్తి షాట్ గన్ తో కాల్చి చంపడంతో ప్రపంచం షాక్ కు గురైంది. గుజరాత్ లోని మోర్బీ లో ఓ వంతెన కూలి 135 మంది ప్రజలు కన్నుమూయడంతో దేశం మొత్తం మౌనంగా రోదించింది.