మార్వెల్ మూవీ ‘థోర్ : లవ్ అండ్ థండర్’ తెలుగు ట్రైలర్ ఈరోజు రిలీజ్ అయింది. 2017లో వచ్చిన తొలి థోర్ సినిమా తర్వాత 2వ పార్ట్గా ఈ మూవీని తెస్తున్నారు. థోర్గా క్రిస్ హెమ్స్వర్త్, జేన్ ఫోస్టర్గా నటాలీ పోర్ట్మన్, విలన్గా ఆస్కార్ విన్నర్ క్రిస్టియన్ బేల్లు నటిస్తున్నారు. ట్రైలర్లో విలన్ చెబుతున్న ‘దేవుళ్ళకి వాళ్ళ స్వార్థమే ముఖ్యం’ అనే డైలాగ్ ఆకట్టుకుంటోంది. కళ్ళు చెదిరే గ్రాఫిక్స్తో వస్తున్న ఈ మూవీ జులై 8న తెలుగులో విడుదల కానుంది.