దేశవ్యాప్తంగా నివాసానికి అనుకూలంగా ఉన్న పట్టణాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ నుంచి మూడు నగరాలకు చోటు దక్కింది. గుంటూరుకు ఆరో స్థానం దక్కగా, విజయవాడకు 8, విశాఖకు 9వ స్థానాలు దక్కినట్లు కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ సిటిజన్ పర్సెప్షన్ సర్వే వెల్లడించింది. దేశవ్యాప్తంగా ప్రజల అభిప్రాయాల ద్వారా ఈ సర్వే ను నిర్వహించారు. జాతీయ స్థాయి ర్యాంకుల్లో థానే, బెంగళూరు, భోపాల్ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. పింప్రి చించ్వాడ్, మిరా, నవీ ముంబై, కల్యాన్ డోంబివాలి టాప్ 10లో నిలిచిన మిగిలిన పట్టణాలు.