జమ్ము కశ్మీర్లోని బారాముల్లాకు చెందిన నజిభట్ క్రాసింగ్ వద్ద బుధవారం ఉదయం ఎన్కౌంటర్ ప్రారంభం అయినట్లు కశ్మీర్ జోన్ పోలీసులు వెల్లడించారు. ఇప్పటివరకు ఈ ఘటనలో ముగ్గురు పాకిస్తానీ తీవ్రవాదులు మరణించారని, జేకేపీ సిబ్బంది ఒకరు అమరుడయ్యారని కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ చెప్పినట్లు ఏఎన్ఐ పేర్కొంది. బారాముల్లాలోని నజిభట్ క్రాసింగ్ వద్ద ఉన్న క్రీరి ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది.