ఏ ముహూర్తాన మస్క్ ట్విట్టర్ను కొంటానని చెప్పాడో గానీ అప్పటి నుంచి ఈ మైక్రై బ్లాగింగ్ సంస్థ మేనేజ్మెంట్ కుదుపులకు లోనవుతోంది. ఇటీవల ఈ సంస్థ సీఈవో పరాగ్ అగర్వాల్ సంస్థలోని సీనియర్ ఉద్యోగుల్ని తొలగించిన సంగతి తెలిసిందే. దీని తర్వాత ఆ సంస్థ సీనియర్ ఉద్యోగులైన ఇల్యా బ్రైన్, కత్రినా లేన్, మాక్స్ స్మీషర్లు సైతం కంపెనీని వీడినట్లు టెక్ క్రంచ్ రిపోర్ట్ చేసింది. లింక్డ్ ఇన్ సంస్థ నుంచి వచ్చిన వీరంతా గత ఏడాదిన్నరగా ట్విటర్లో కొనసాగుతున్నారు.