తమిళనాడు శాసనసభను ఉద్దేశించి తొలిరోజు చేసే ప్రసంగంలో ‘అంబేద్కర్, ద్రవిడ నేతలు, ద్రవిడ పాలన’ను ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి ప్రస్తావించకపోవడం వివాదానికి దారి తీసింది. దీనిపై సిఎం అభ్యంతరం వ్యక్తం చేయడంతో, గవర్నర్ సోమవారం అసెంబ్లీ నుండి అర్ధంతరంగా వాకౌట్ చేశారు. శాసనసభను ఉద్దేశించి గవర్నర్ చేసే సాంప్రదాయ ప్రసంగం నుండి కొన్ని భాగాలను వదిలేయడంతో స్టాలిన్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఆమోదించబడిన ప్రసంగ పాఠం నుండి గవర్నర్ ఒక పేరాగ్రాఫ్ను చదవకుండా వదిలిపెట్టడమే ఈ పరిస్థితికి కారణమైంది.
What a disgrace ! Its unbecoming of a Governor #TamilNadu pic.twitter.com/6RBTiOV9Wc
— Jothimani (@jothims) January 9, 2023