టాప్​ 50 మంది ఎగవేసింది రూ.92 వేల కోట్లు

By udayam on December 22nd / 5:32 am IST

దేశంలో పలు బ్యాంకులను మోసం చేసిన టాప్​ 50 మందిలో మోహుల్​ చోక్సీ అగ్రస్థానంలో ఉన్నట్లు ప్రభుత్వం పార్లమెంట్​ లో వెల్లడించింది. టాప్​ 50 లో ఉన్నవారంతా బ్యాంకులకు ఏకంగా రూ.92,570 కోట్లు ఎగ్గొట్టినట్లు అంకెలతో సహా వెల్లడించింది. వీరిలో రూ.7,848 కోట్లతో డైమండ్​ వ్యాపారి మోహుల్​ చోక్సీ అగ్రస్థానంలో ఉన్నట్లు పేర్కొంది. అతడి తర్వాత ఎరా ఇన్ఫా రూ.5879 కోట్లు, రైగో ఆగ్రో రూ.4803 కోట్లతో 2, 3 స్థానాల్లో ఉన్నా,రు. కాంకాస్ట్​ స్టీల్​ అండ్​ పవర్​ రూ.4596 కోట్లు, ఎబిజి షిప్​ యార్డ్​ రూ.3708 కోట్లు ఎగవేశాయి.

ట్యాగ్స్​