దిగుమతి సుంకం తగ్గించనున్న కేంద్రం!

By udayam on May 6th / 5:49 am IST

దేశంలో అమ్ముడవుతున్న కొన్ని రకాల వంటనూనెలపై పన్నుల శాతాన్ని తగ్గించాలని కేంద్రం నిర్ణయించింది. ఓ వైపు ఉక్రెయిన్​ యుద్ధం, మరో వైపు పామాయిల్​ ఎగుమతులపై ఇండోనేషియా నిషేధం వంటి చర్యలతో దేశంలో మండిపోతున్న నూనె ధరలపై పన్నులను తగ్గించి సామాన్యులకు ఊరట కలిగించాలని నిర్ణయించింది. ముడి పామాయిల్​ దిగుమతులపై వ్యవసాయ మౌలిక సదుపాయాలు, అభివృద్ధి సెస్​ను తగ్గించాలని ఆలోచిస్తోంది. భారత్​ తన వంటనూనె అవసరాల్లో 60 శాతాన్ని దిగుమతి చేసుకుంటోంది.

ట్యాగ్స్​