దేశంలో కరోనా కేసులు 4 వేలకు చేరువుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,805 కరోనా కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 3,168 మంది కొవిడ్ నుంచి కోలుకోగా 22 మంది కరోనాకు బలయ్యారు. దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 20,303 కు చేరింది. నిన్నటి వరకూ దేశం మొత్తంగా 190 కోట్ల వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగింది. రికవరీ రేట్ 98.74 శాతంగా ఉండగా.. పాజిటివిటీ రేట్ 0.78 శాతానికి పెరిగింది.