జూన్ 10న తెలంగాణలో జరగనున్న రాజ్యసభ ఎన్నికలకు తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులను ఖరారు చేసింది. నమస్తే తెలంగాణ పేపర్ ఎండీ దీపకొండ దామోదర్రావుకు, డాక్టర్ బండి పార్థసారథి రెడ్డి, బీసీ నేత, పారిశ్రామిక వేత్త అయిన వద్దిరాజు రవిచంద్రల పేర్లను సిఎం కేసీఆర్ ఖరారు చేశారు. అటు ఏపీలోనూ విజయ సాయిరెడ్డి, ఆర్.కృష్ణయ్య, నిరంజన్రెడ్డి, బీద మస్తాన్రావు పేర్లను మంగళవారం నాడు సిఎం జగన్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే.