బస్సు బయులుదేరిన తర్వాత కూడా తమ ప్రయాణానికి 15 నిమిషాల ముందు ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది టిఎస్ఆర్టీసీ. దీనికి డిజిటల్ పేమెంట్స్ ద్వారా డబ్బులు చెల్లించేలా కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ప్పటికే ప్రయోగాత్మకంగా రాష్ట్రవ్యాప్తంగా 600 బస్సులలో ఐ టిమ్స్ అనే ఈ నూతన టెక్నాలజీని ప్రవేశపెట్టగా.. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని బస్సులలో ప్రవేశపెట్టాలని తాజాగా టీఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది.