తెలంగాణ ఆర్టీసీ ప్యాసింజర్ ఫ్రెండ్లీ సర్వీస్లో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద దిగే ప్రయాణికుల కోసం ఫ్రీ సర్వీసులను అందుబాటులోకి తేనుంది. బ్యాటరీ వెహికల్స్ ద్వారా ప్రయాణికులను దగ్గర్లోని బస్ స్టాప్ల వద్దకు ఉచితంగా తరలించనుంది. 10 రోజుల్లో ఈ సర్వీసు ప్రారంభం కానున్నట్లు టిఎస్ఆర్టీసి సికింద్రాబాద్ రీజనల్ మేనేజర్ వెల్లడించారు. ప్రయాణికులను ఉప్పల్, మెట్టుగూడ, చిలకలగూడ, గాంధీ ఆసుపత్రి బస్స్టాండ్ల వద్ద దించనున్నారు.