భారత గోధుమల్ని తిప్పిపంపిన టర్కీ

By udayam on June 2nd / 6:50 am IST

భారత్​ నుంచి గోధుమల లోడుతో వెళ్ళిన ఓ భారీ షిప్పును టర్కీ అధికారులు తిప్పి పంపారు. ఈ గోధుమల్లో ఫైటోశానిటరీ వైరస్​ జాడలు ఉన్నట్లు చెప్పిన ఆ దేశం ఈ గోధుమలను తాము దిగుమతి చేసుకోలేమని మే 29న ఈ లోడ్​ను భారత్​కు రిటర్న్​ చేసేశారు. ఈ భారీ షిప్పులో ఏకంగా 1.5 మిలియన్​ టన్నుల గోధుమలు ఉన్నట్లు భారత వ్యాపార వర్గాలు వెల్లడించాయి. టర్కీలోని కండ్లా పోర్ట్​ నుంచి బయల్దేరిన ఈ షిప్పులో 56,877 టన్నుల గోధుమ పిండి కూడా ఉందని భారత్​ పేర్కొంది.

ట్యాగ్స్​