ట్విట్టర్​: టాప్​ ఎగ్జిక్యూటివ్​లను తొలగించిన పరాగ్​

By udayam on May 13th / 10:44 am IST

ట్విట్టర్​ సిఈవో పరాగ్​ అగర్వాల్​ ఆ కంపెనీ టాప్​ ఎగ్జిక్యూటివ్​లలో ఇద్దరిని తొలగించాడు. ట్విట్టర్​ హెడ్​ ఆఫ్ ప్రొడక్ట్​గా ఉన్న బెక్​పూర్​ను, రెవెన్యూ హెడ్​ బ్రూస్​ ఫలాక్​ను విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. దాంతో పాటు సంస్థలో కొత్తగా ఉద్యోగ నియామకాలను సైతం నిలిపివేస్తున్నట్లు పరాగ్​ వెల్లడించారు. రాబోయే 6 నెలల్లో ట్విట్టర్​ కొనుగోలు డీల్​ను పూర్తి చేశాక ఎలన్​ మస్క్​.. సీఈఓ పరాగ్​ అగర్వార్​ను సైతం తప్పిస్తారని తెలుస్తోంది.

ట్యాగ్స్​