ట్విట్టర్లో మరోసారి భారీగా డేటా చోరీ జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 50 కోట్ల మంది యూజర్ల డేటాను హ్యాకర్లు డార్క్ వెబ్ లో అమ్మకానికి పెట్టేశారు. ఈ డేటాలో భారత సంతతి గూగుల్ సీఈఓ సుందర్ పిచయ్, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, డబ్ల్యుహెచ్ఓ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, బడా కంపెనీల డేటా ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ట్విట్టర్లో జరగిన డేటా బ్రీచ్ లో 54 లక్షల ఖాతాల డేటా చోరీకి గురైన ఘటన మరవక ముందే మరోసారి అలాంటి ఘటనే రిపీట్ అయింది.