మైక్రోబ్లాగింగ్ యాప్ ట్విట్టర్ తన యూజర్లు చేసే ట్వీట్లకు అవార్డులు ఇవ్వనుంది. దీంతో పాటు ఒకే ట్వీట్లో పిక్చర్స్, వీడియోలనూ కలిపి పోస్ట్ చేసుకునే సరికొత్త ఫీచర్ను కూడా తీసుకురానుంది. 9టు5గూగుల్ అనే వెబ్సైట్ దీనిపై కథనాన్ని ప్రచురించింది. ఇటీవలే ఈ సంస్థను ఎలన్ మస్క్ కొనుగోలు చేసిన అనంతరం ట్విట్టర్ తీసుకొస్తున్న తొలి మార్పులు ఇవే. దీంతో పాటు ఎడిట్ బటన్ను కూడా టెస్టింగ్కు పెట్టిన ఈ యాప్ సరికొత్త సర్కిల్స్ ఫీచర్నూ తీసుకొస్తోంది.