నిన్న రాత్రి ఘోర రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలతో బయటపడ్డ క్రికెటర్ రిషబ్ పంత్ పరిస్థితిపై వైద్యులు బులిటెన్ ను విడుదల చేశారు. డెహ్రాడూన్ లోని మ్యాక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పంత్ కు ఆర్ధోపెడిక్, ప్లాస్టిక్ సర్జన్ల పర్యవేక్షణలో పరీక్షలు జరిపారు. ప్రస్తుతం అతడికి స్వల్ప గాయాలు మాత్రమే అయినట్లు నిర్ధారించిన వైద్యులు పరీక్షల రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మరోసారి హెల్త్ బులిటెన్ ను విడుదల చేస్తామన్నారు. అతడు చికిత్సకు స్పందిస్తున్నాడని, ప్రశ్నలకు సమాధానాలూ ఇస్తున్నట్లు వెల్లడించారు.
Shocking accident caught on camera. #RishabhPant's car crashed into a divider, car caught fire 6 minutes after the crash. pic.twitter.com/nsWrFvji73
— Shubhankar Mishra (@shubhankrmishra) December 30, 2022