విజయవాడ హైవేపై అబ్దుల్లాపూర్మెట్ పిఎస్ పరిధిలో రెండు మృతదేహాలు నగ్నంగా కనిపించడంతో స్థానికంగా కలకలం సృష్టించింది. వివాహేతర సంబంధమే ఈ హత్యలకు కారణమని పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మరణించిన వారిని కార్ డ్రైవర్ యశ్వంత్ (22), జ్యోతి (28)గానూ పోలీసులు గుర్తించారు. జ్యోతికి ఇదివరకే పెళ్ళయ్యిందని, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. మృతులు ఇద్దరూ వారాసిగూడకు చెందిన వారుగా తెలిపారు.