కశ్మీర్​ పండిట్​ను చంపిన ఉగ్రవాదులు హతం

By udayam on May 14th / 7:29 am IST

కశ్మీర్ పండిట్​ను అతడి కార్యాలయంలోనే కాల్చి చంపిన ఇద్దరు ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టింది. వీరిద్దరూ లష్కరే తాయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన వారని భద్రతా దళాలు వెల్లడించాయి. శుక్రవారం ఉత్తర కశ్మీర్​లోని బంధిపోరా జిల్లాలో జరిగిన ఎన్​కౌంటర్​లో ఈ ముష్కరులను సైన్యం ఏరిపారేసింది. ఫైసల్​ అలియాస్​ సికందర్​, అబు ఉకాసా అనే ఈ ఇద్దరు టెర్రరిస్టులు కశ్మీర్​ వ్యాలీలో పలువురిని హత్య చేశారని జమ్మూ పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్​