ఒడిశా: ఇద్దరు మహిళా నక్సలైట్లు హతం

By udayam on November 25th / 4:56 am IST

ఒడిశాలో గురువారం జరిగిన ఎన్​ కౌంటర్​ లో ఇద్దరు మహిళా నక్సలైట్లు హతమయ్యారు. కమ్యూనిస్ట్​ పార్టీ (మావోయిస్ట్​) దళానికి చెందిన గంధమర్ధన్​ కొండ ప్రాంత యూనిట్​ లో వీరు సభ్యులుగా పోలీసులు గుర్తించారు. ఇంటెలిజెన్స్​ రిపోర్ట్​ మేరకు నక్సలైట్ల కదలికలను గుర్తించిన పోలీసులు వారిని మట్టుబెట్టినట్లు ఒడిశా డిజిపి సునీల్​ భన్సల్​ వెల్లడించారు. సరెండర్​ కావాలని పదే పదే విజ్ఞప్తి చేసినా కాల్పులు జరిపారని, దీంతో ఎదురుకాల్పులు జరిపి వారిని మట్టుబెట్టినట్లు ఆయన వెల్లడించారు.

ట్యాగ్స్​