నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్-2 టాక్ షో నాలుగో ఎపిసోడ్ టీజర్ వచ్చేసింది. మాజీ సిఎం కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ స్పీకర్ సురేశ్ రెడ్డిలతో పాటు.. హీరోయిన్ రాధిక లు ఈ ఎపిసోడ్ లో హల్ చల్ చేశారు. బెస్ట్ ఫ్రెండ్స్ తో బాలయ్య అల్లరి నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. రాజకీయ పరమైన, జీవితంలో జరిగిన అత్యంత ముఖ్యమైన ఘట్టాలను ఈ ప్రోగ్రామ్ లో కిరణ్ కుమార్ రెడ్డి వెల్లించారు. ‘మనం గొప్ప నేతలను, వ్యక్తులను కోల్పోయామని, అలాంటివారిలో రాజశేఖర్ రెడ్డి ఒకరు’ అని అనడం ప్రోమోలో కనిపించింది.