న్యాయం చేయాల్సిన పోలీసులే 13 ఏళ్ళ చిన్నారిని చెరపట్టిన ఉదంతం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని లలిత్ పూర్ స్టేషన్లో చోటు చేసుకుంది. నలుగురు యువకులు తనను రేప్ చేశారని ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఆ మహిళపై లలిత్పూర్లోని పాలి పోలీస్ స్టేషన్ హౌస్ అధికారి తిలక్ థారి సరోజ్ అత్యాచారం చేశాడని ఎస్పీ నిఖిల్ పాఠక్ తెలిపారు. ఈ ఘటనపై మంగళవారం ప్రాథమిక విచారణ నివేదిక నమోదైంది. పోక్సో చట్టంతో పాటు ఎస్సీ, ఎస్టీ చట్టంలోని సెక్షన్ల కింద నిందితులపై కేసు నమోదైంది.