ఉత్తరప్రదేశ్కు చెందిన మంత్రి గిరీష్ చంద్ర యాదవ్ను ఎలుకలు కరవడంతో ఆసుపత్రి పాలయ్యారు. ఆ రాష్ట్ర యూత్ వెల్ఫేర్, స్పోర్ట్స్ మంత్రిగా ఉన్న ఆయనను సోమవారం తెల్లవారుఝామున ఎలుకలు కరిచాయి. ఆ సమయంలో ఆయన బండా జిల్లాలో పర్యటనలో ఉన్న ఆయన సర్క్యూట్ హౌస్లో బస చేస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే అధికారులు ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన కుడి చేతిని ఎలుకలు కొరికాయని జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్.ఎన్.మిశ్రా తెలిపారు.