ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ ఉన్నతాధికారి కరడుగట్టిన అల్ఖైదా తీవ్రవాది ఒసామా బిన్ లాడెన్ ఫొటోను తన కార్యాలయంలో ఉంచుకోవడంతో సస్పెండ్ అయ్యాడు. ‘ప్రపంచపు అత్యుత్తమ జూనియర్ ఇంజనీర్’ అంటూ లాడెన్ను విద్యుత్ విత్రాన్ నిగమ్ లిమిటెడ్లో పనిచేస్తున్న రవీంద్ర ప్రకాశ్ గౌతమ్ అనే అధికారి కీర్తించేవాడని తెలుస్తోంది. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో ఆ రాష్ట్ర అధికారులు చర్యలు తీసుకున్నారు.