ఉత్తరప్రదేశ్ లోని మీర్జాపూర్ జిల్లాకు చెందిన ఓ టివి మెకానిక్ కూతురు సానియా మీర్జా చరిత్ర సృష్టించింది. భారత ఎయిర్ ఫోర్స్ లో ఫైటర్ జెట్ పైలట్ గా సానియా ఎంపికైంది. దీంతో ఈ ఘనత సాధించిన తొలి ముస్లిం మహిళగా ఆమె రికార్డు నెలకొల్పింది. ఎన్.డి.ఎ. పరీక్షల్లో పాసైన ఆమె.. ఈనెల 27న ఎన్.డి.ఎ. ఖడక్ వాలా క్యాంప్ లో జాయిన్ కానుంది. తన తల్లి దండ్రుల కృషి వల్లే తాను ఈ ఘనత సాధించగలిగానని సానియా వెల్లడించింది.