నాలుగేళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత క్యూబాలోని అమెరికన్ ఎంబసీ.. అక్కడి పౌరులకు యుఎస్ వీసాల జారీని మొదలుపెట్టింది. క్యూబా రాజధానిలో 2017లో అమెరికా అధికారులే లక్ష్యంగా సోనిక్ దాడి జరిగిన అనంతరం అమెరికా అక్కడి పౌరులకు వీసా జారీ ప్రక్రియను నిలిపేసింది. హవానా సిండ్రోమ్గా పేరుగాంచిన ఈ ఘటన అనంతరం క్యూబా, అమెరికా దేశాల మధ్య దౌత్య సంబంధాలు సైతం దారుణంగా దెబ్బతిన్నాయి.