మైక్రో బ్లాగింగ్ యాప్ ట్విట్టర్పై అమెరికా సెక్యూరిటీస్ సంస్థ రూ.1000 కోట్లకు పైగా భారీ జరిమానాను విధించింది. యూజర్ల ఫోన్ నెంబర్లు, ఈమెయిల్ అడ్రస్లను తీసుకుంటున్న ట్విట్టర్ వాటిని అడ్వర్టైజింగ్ సంస్థలకు అమ్ముకున్నట్లు వచ్చిన ఫిర్యాదు నిజమని తేలడంతో అమెరికా ప్రభుత్వం ట్విట్టర్ పై 150 మిలియన్ల జరిమానాను విధించింది. దీంతో ట్విట్టర్ రూ.1,164 వేల కోట్లను చెల్లించడానికి అమెరికా ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది.