మహారాష్ట్ర కాక రేపుతున్న లౌడ్స్పీకర్ల అంశంపై అలహాబాద్ హైకోర్ట్ కీలక వ్యాఖ్యలు చేసింది. మసీదుల్లో లౌడ్స్పీకర్ల ఏర్పాటు ప్రాథమిక హక్కుల కిందకు రాదని తీర్పు చెప్పింది. మసీదుల్లో లౌడ్స్పీకర్లు/మైకులు వాడకాన్ని కొనసాగించాలంటూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన కోర్టులోని జస్టిస్ వివేక్ కుమార్ బిర్లా, వికాస్ బుధ్వార్ల బెంచ్ ఈ తీర్పు చెప్పింది. అజాన్ టైంలో అయినా స్పీకర్ల వాడకాన్ని కొనసాగనివ్వాలని పిటిషనర్ వేసిన వ్యాజ్యాన్ని కొట్టేసింది.