ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఈరోజు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. చంపావట్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన తన సమీప ప్రత్యర్ధి, కాంగ్రెస్ అభ్యర్ధి నిర్మల గహ్టోరిపై 55,025 ఓట్ల తేడాతో విజయం సాధించారు. సిఎంగా ఎన్నికైన తర్వాత 6 నెలల్లోగా ఎమ్మెల్యే అవ్వాలన్న నిబంధన మేరకు ఆయన ఈ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. పుష్కర్ విజయంపై ప్రధాని నరేంద్ర మోదీ సైతం శుభాకాంక్షలు తెలిపారు.