దేశంలో సుప్రీంకోర్టు నుంచి కింద కోర్టు వరకు 6,189 జడ్జి పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు రాజ్యసభలో వెల్లడించారు. 022 జనవరి 19 నాటికి దేశవ్యాప్తంగా జిల్లా, సబార్డినేట్ కోర్టుల్లో 5,850 పోస్టులు ఖాళీగా ఉన్నాయన్న ఆయన ఆంధ్రప్రదేశ్ లో 73, తెలంగాణలో 150 పోస్టులు భర్తీ కావాల్సి ఉందన్నారు. దేశంలో 2022 డిసెంబర్ 15 నాటికి కిందస్థాయి కోర్టుల్లో 4,29,40,290 కేసులు పెండింగ్లో ఉన్నాయని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో 8,16,562 కేసులు, తెలంగాణలో 10,52,051 కేసులు పెండింగ్ లో ఉన్నట్లు తెలిపారు.