అమెరికాలోని కొవిడ్ మృతుల్లో ఎక్కువ మంది కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారే ఉంటున్నారని వాషింగ్టన్ పోస్ట్ సంచలన నివేదికలో వెల్లడైంది. ఈ ఏడాది ఆగస్ట్ లో కొవిడ్ తో మరణించిన వారిలో 58 శాతం మంది రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ ను తీసుకున్న వారే ఉన్నట్లు బయటపెట్టింది. వీరిలో సగానికి పైగా బూస్టర్ డోస్ కూడా తీసుకున్నట్లు తెలిపింది. కొవిడ్ వ్యాప్తి మొదలైన తర్వాత తొలిసారి.. కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోని వారి మరణాలు భారీగా తగ్గాయని తెలిపింది. ఆగస్ట్ నెలలో మొత్తం కొవిడ్ మృతుల్లో వీళ్ళు 23 శాతం మాత్రమే ఉన్నట్లు పేర్కొంది.