గంటకు 150 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే వందేభారత్ సెమీ హై స్పీడ్ రైలు బెజవాడకు అతి త్వరలో రాబోతోంది. ఈ ఎక్ప్రెస్ను బెజవాడకు నడపాలని దక్షిణ మధ్య రైల్వే భావిస్తోంది. ఇందుకు సంబంధించి దక్షిణ మధ్య రైల్వే జీఎం కూడా ఆమోదముద్ర వేశారని తెలుస్తోంది. విజయవాడ – సికింద్రాబాద్ గోల్డెన్ డయాగ్నల్ రూట్, విశాఖపట్నం – విజయవాడ గోల్డెన్ క్వాడ్రలేట్రల్ రూట్లను పరిశీలిస్తున్నారు. బెజవాడ – సికింద్రాబాద్ మధ్య కానీ, విశాఖ – విజయవాడ – సికింద్రాబాద్ మధ్య కానీ ప్రవేశ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.