తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదురుచూస్తోన్న వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలుకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. తెలంగాణలోని సికింద్రాబాద్ నుంచి ఈనెల 19న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న ఈ ట్రైన్ విశాఖకు చేరే లోపు తెలంగాణ లోని వరంగల్, ఖమ్మం, ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, రాజమండ్రి స్టేషన్లలో హాల్ట్ చేయనుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ట్విట్టర్లో ప్రకటించారు.