జ్ఞాన్​వాపి సర్వే అడ్వొకేట్​ను తొలగించిన కోర్ట్​

By udayam on May 17th / 12:49 pm IST

జ్ఞానవాపి మసీదు సర్వే నివేదికను లీక్​ చేసినందుకు ఈ సర్వేకు నేతృత్వం వహించిన అడ్వొకేట్​ కమిషనర్​ అజయ్​ కుమార్​ మిశ్రాను వారణాసి కోర్ట్​ తొలగించింది. అజయ్​ మిశ్రా సన్నిహితుడు మీడియాకు ఈ రిపోర్ట్​ లీక్​ చేసినట్లు గుర్తించిన కోర్ట్​.. తన తుది నివేదికను ఇవ్వడానికి ప్యానెల్​కు మరో 2 రోజుల గడువు ఇచ్చింది. 3 రోజుల పాటు ఈ మసీదులో వీడియో గ్రఫీ సర్వే చేసిన ఈ కమిటీ అక్కడి నీటి కొలనులో 12 అడుగుల శివ లింగాన్ని గుర్తించిన వార్తలు మీడియాలో లీక్​ అయ్యాయి.

ట్యాగ్స్​