కాశీ విశ్వనాథ ఆలయ ప్రాంగణంలో ఉన్న జ్ఞానవాపి మసీదులో 3 రోజుల పాటు జరిగిన వీడియో రికార్డింగ్లో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఇక్కడి నీటి మడుగులో శివలింగాన్ని గుర్తించినట్లు హిందూ ధర్మకర్త మండలి కోర్టుకు వెల్లడించింది. దీంతో శివలింగం దొరికిన ప్రాంతాన్ని వెంటనే సీజ్ చేయాలని కోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. మడుగులో నీటిని తొలగించి ఈ శివలింగాన్ని గుర్తించినట్లు లాయర్ శుభాష్ నందన్ చతుర్వేది తెలిపారు. ఈ మడుగును ముస్లింలు ఉజు కోసం ఉపయోగిస్తారని తెలుస్తోంది.