20 రోజుల క్రితం రూ.10 నుంచి రూ.20 పలికిన కేజీ టమాటా ఇప్పుడు కొండెక్కి కూర్చుంది. తెలంగాణలోని పలు మార్కెట్లలో టమాటా కేజీ రూ.80 నుంచి రూ.100 పలుకుతూ సామాన్యులకు అందని ద్రాక్ష అయింది. పెరిగిన ఎండలకు దిగుబడి తగ్గడం ఓ ఎత్తైతే.. పెళ్ళిళ్ళ సీజన్లో కూరగాయలకు డిమాండ్ ఉండడమూ ధరల పెరుగుదలకు మరో కారణంగా కనిపిస్తోంది. టమాటాలతో పాటు క్యారెట్, చిక్కుళ్ళు, బంగాళాదుంపలు, వంకాయలు, బీరకాయలు, మిర్చి, దొండకాల రేట్లూ 100 శాతం పెరిగాయి.