సంక్రాంతి వచ్చిందంటే చాలు చాలు హైదరాబాద్ నగరం ఖాళీ అవుతుంది. ఈరోజు నుండి స్కూల్స్ , కాలేజీలకు సెలవులు ఇవ్వడం తో సొంతూళ్లకు పయనమయ్యారు. దీంతో అన్ని టోల్ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరాయి. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ అధికమైంది. ఈనేపథ్యంలో చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. టోల్ బూత్లలో రెండు సెకన్లకే వాహనాలు వెళ్లేందుకు ఏర్పాట్లు చేయడంతో వాహనాలు తొందరగా వెళ్తున్నాయి.