కాంగ్రెస్​ సీనియర్​ నేత సుఖ్​రామ్​ మృతి

By udayam on May 11th / 6:21 am IST

కాంగ్రెస్​ సీనియర్​ నేత పండిట్​ సుఖ్​ రామ్​ ఈరోజు కన్నుమూశారు. ఆయన వయసు 95 సంవత్సరాలు. ఎయిమ్స్​లో చికిత్స తీసుకొంటున్న ఆయన బ్రెయిన్​ స్ట్రోక్​తో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. హిమాచల్​ ప్రదేశ్​లోని మనాలికి చెందిన ఆయన 2017లో కాంగ్రెస్​ను వీడి తిరిగి 2019లో అదే పార్టీలో చేరారు. 1993–1996 మధ్య ఆయన దేశానికి కమ్యూనికేషన్​, ఇన్ఫర్మేషన్​ టెక్నాలజీ మంత్రిగా పనిచేశారు. ఐదుసార్లు హిమాచల్​ ప్రదేశ్​ నుంచి ఎమ్మెల్యేగానూ, 3 సార్లు ఎంపిగానూ గెలిచారు.

ట్యాగ్స్​