స్టేజ్​ పైనే మరణించిన ప్రముఖ సింగర్​

By udayam on May 30th / 7:17 am IST

ప్రముఖ మలయాళ నేపథ్య గాయకుడు ఎడవ బషీర్​ ఓ సంగీత విభావరిలో గానమాలపిస్తూ కుప్పకూలారు. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించినా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. గుండెపోటుతోనే ఆయన మృతికి కారణమని వైద్యులు తేల్చారు. ఈనెల 28న అలప్పుజాలో జరిగిన బ్లూ డైమండ్​ ఆర్కెస్ట్రా స్వర్ణోత్సవ వేడుకల్లో యేసుదాసు గీతం మానో హో తుమ్​ పాట పాడుతూ ఆయన తుది శ్వాస విడిచారు. రఘు వంశం సినిమాతో తొలిసారిగా సినిమాలకు పాట పాడిన ఆయన పలు దేశాల్లో జరిగిన కన్సర్ట్​లలోనూ ఆయన ప్రదర్శనలిచ్చారు.

ట్యాగ్స్​