ప్రతీ ఏటా క్రిస్మస్ కు తన ఫ్యాన్స్ కు గిఫ్ట్స్ ఇచ్చే టాలీవుడ్ అర్జున్ రెడ్డి.. విజయ్ దేవరకొండ.. ఈ ఏడాది 100 మంది తన అభిమానులను మనాలి ట్రిప్ కు పంపిస్తున్నట్లు తాజాగా ప్రకటించాడు. ఇందుకోసం ఓ ట్విట్టర్ పోల్ ను నిర్వహించిన విజయ్ అందులో మౌంటేన్స్ ఆఫ్ ఇండియా, బీచెస్ ఆఫ్ ఇండియా, కల్చర్ ట్రిప్ ఆఫ్ ఇండియా, డిజర్ట్స్ ఇన్ ఇండియా లలో దేనీకి మీరు ఓటేస్తారు? అంటూ ప్రశ్నించాడు. ఇందులో ఎక్కువ మంది పర్వతాలకు వెళ్తామని ప్రకటించడంతో విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ బహుమతిలో మరో ట్విస్ట్ ఏంటంటో వీళ్ళతో పాటు మన హీరో కూడా ఈ ట్రిప్ మధ్యలో జాయిన్ కానున్నాడు.
#WATCH: Vijay 'DeveraSanta' to send 100 fans to Manali on an all-expense paid holiday! #VijayDeveraSanta #VijayDeverakonda @TheDeverakonda #SantaClaus #DeveraSanta #Manali #Holiday pic.twitter.com/YVkWZpApJB
— HT City (@htcity) January 8, 2023