#Deverasanta2022​: 100 మందిని ఖరీదైన ట్రిప్స్​ కు పంపిస్తున్న లైగర్​

By udayam on December 26th / 12:24 pm IST

ప్రతీ ఏటా క్రిస్మస్​ కు తన ఫ్యాన్స్​ కు గిఫ్ట్స్​ ఇచ్చే టాలీవుడ్​ అర్జున్​ రెడ్డి.. విజయ్​ దేవరకొండ ఆ సంప్రదాయన్ని ఈ ఏటా కొనసాగించాడు. ఈసారి ఏకంగా దేశంలోని ప్రముఖ టూరిస్ట్​ స్పాట్స్​ కు తన ఫాలోవర్లలో 100 మందిని పంపించనున్నాడు. ఇందుకోసం ఓ ట్విట్టర్​ పోల్​ ను నిర్వహించిన విజయ్​ అందులో మౌంటేన్స్​ ఆఫ్​ ఇండియా, బీచెస్​ ఆఫ్​ ఇండియా, కల్చర్​ ట్రిప్​ ఆఫ్​ ఇండియా, డిజర్ట్స్​ ఇన్​ ఇండియా లలో దేనీకి మీరు ఓటేస్తారు? అంటూ ప్రశ్నించాడు. నిన్న రాత్రి 7.56 కి పెట్టిన ఈ పోల్​ లో ఇప్పటి వరకూ 42 శాతం మంది పర్వతాలకు ఓటేస్తే.. బీచ్​ లకోసం 24 శాతం మంది, కల్చరల్​ ట్రిప్​ కోసం 27 శాతం మంది ఎడారుల్లో విహరిస్తామనం 6 శాతం మంది ఓటేశారు.

ట్యాగ్స్​