భారత సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కొంత కాలం పాటు తనను టి20 ఫార్మాట్ కు ఎంపిక చేయవద్దని సెలక్టర్లకు సూచించాడు. వన్డేలు, టెస్టుల్లో తన బ్యాటింగ్ ను మరింత మెరుగు పరుచుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కోహ్లీ వెల్లడించాడు. దీంతో అతడు వచ్చే ఏడాది జరిగే శ్రీలంక టూర్ తో పాటు ఏప్రిల్ లో జరిగే ఐపిఎల్ వరకూ ఒక్క టి20 మ్యాచ్ కూడా ఆడే అవకాశం లేదు. ప్రస్తుతం ఫ్యామిలీ ట్రిప్ లో ఉన్న కోహ్లీ.. శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్ కు అందుబాటులో ఉండనున్నాడు.