విశాఖ నగర సమీపంలోని పెందుర్తి మండలం ఎస్.ఆర్.పురం గ్రామంలో 80 ఎకరాల్లో విస్తరించి ఉన్న కొండ శిఖరం ఒక్కసారిగా కూలడం స్థానికంగా కలకలం రేపింది. ఈ కొండపై అక్రమంగా గ్రావెల్, బిల్డింగ్ స్టోన్ తవ్వకాలు జరపడమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. బుధవారం రాత్రి నుంచే కొద్ది కొద్దిగా కూలుతున్న ఈ కొండ గురువారం నాడు కొండ శిఖరం భారీ శబ్దం చేస్తూ జారిపడింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.