ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నుంచి చెన్నై వరకూ సముద్రయానం చేయాలనుకుంటున్నారా! అయితే ఇది మీకు గుడ్న్యూసే. విశాఖ నుంచి ఈనెల 8వ తేదీన క్రూజ్ నౌక పుదుచ్చేరి మీదుగా చెన్నైకు ప్రయాణించనుంది. తిరిగి విశాఖకు చేరుకోనున్న ఈ నౌకలో ఇంటీరియర్ స్టాండర్డ్, స్టాండర్డ్, ఓషన్ వ్యూ స్టాండర్డ్, మినీ సూట్ రూమ్ పేరిట నాలుగు విభాగాలు ఉన్నాయి. రెస్టారెంట్లు, క్యాసినోలు ఉన్న ఈ నౌకకు పూర్తి అనుమతులు ఉన్నాయని నాకాశ్రయం ఛైర్మన్ రామమోహనరావు తెలిపారు.