ఎమ్మెల్యేల నుంచి రూ.80 లక్షలు గుంజిన విశాఖ వాసి

By udayam on May 2nd / 7:25 am IST

సిఎంఓ నుంచి మాట్లాడుతున్నానంటూ దేశంలోని పలువురు ఎమ్మెల్యేలను మోసం చేసిన విశాఖపట్టణానికి చెందిన పి.విష్ణుమూర్తి పోలీసులు అరెస్ట్​ చేశారు. ఇలా వసూలు చేసిన రూ.80 లక్షలతో తన గర్ల్​ ఫ్రెండ్​కు ఖరీదైన ఫ్లాట్​ కూడా కొనిచ్చాడని తెలుసుకుని పోలీసులు ఖంగుతిన్నారు. రాజస్థాన్​కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను కూడా సందీప్​ ఇలా డబ్బులు డిమాండ్​ చేశాడు. దీనిపై రాజస్థాన్​ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు ఎపిలోని గాజువాక నుంచి విపిఎన్​ ద్వారా ఫోన్లు చేస్తున్నాడని తేల్చారు.

ట్యాగ్స్​